Phone Tapping Sensational exclusive Information

Cheating Politicians Exclusive Stories

Posted by admin on 2024-03-14 16:44:20 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 1106


Phone Tapping Sensational exclusive Information

  • ప్రణీత్ రావ్ ఫోన్ ట్యాపింగ్ లో సంచలనం.
  • ఓ మీడియా ఓనర్ ఫోన్ లో నుంచి మెస్సెజ్ లు.
  • అప్పటికి అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రణీత్
  • సిట్ దర్యాప్తులో వాట్స్ అప్ రికవరీ.
  • రేవంత్ రెడ్డి టార్గెట్ గానే ఇల్లీగల్ దందా
  • రావులందరూ కలిసి రాజకీయ కుట్ర పై లొతుగా దర్యాప్తు.
  • అరెస్టుల పర్వం కొనసాగితే నేను న్యూస్, గుమాస్తా తెలంగాణ జైలు కే.
  • ప్రభాకర్ రావుకు బిగుస్తున్న ఉచ్చు.
  • ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ఎక్స్లూజివ్ కథనం.

 By 

Devender Reddy

9848070809


ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు భయటపడుతున్నాయి. ఇన్వేస్టిగేషన్ జర్నలిస్టు  దేవేందర్ రెడ్డి ఎక్స్లూజివ్ గా మూడు రోజులుగా వార్తలు ఇస్తునే ఉన్నారు. అందుకు సరిపోయే ఎవిడెన్స్ పోలీసులకు అందించారు. దీంతో దర్యాప్తు వేగవంతం అయింది. నేను న్యూస్ ఓనర్ శ్రా** రావు, చిక్కుల్లో చిక్కుకున్నాడు. మాజీ మంత్రి హరీష్ రావు కి అత్యంత సన్నిహితంగా మొదిలారు. ఎన్నికలకు ఏడాది ముందు ఒక్కటైనా రావులు రాజకీయ కుట్రలు చేశారు. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ లు చేసి డబ్బులు పై ఫోకస్ పెట్టారు. సొంత కుటుంబ సభ్యుల పైన ఎప్పటి నుంచో ఫోన్ ట్యాపింగ్ చేసి నీచానికి పాల్పడ్డారు బీఆర్ఎస్ నేతలు.

 చాట్ లో ఏముందంటే..

అక్టోబర్ 17న రేవంత్ రెడ్డి , శ్రీనివాస్, ఎమ్మార్ ని కలవడానికి  అదికేశవులు కొడుకు శ్రీనివాస నాయుడు వస్తున్నాడు సాయంత్రం కీలక సమావేశం ఉన్నదని ప్రణీత్ కి చేరవేశారు. శ్రీనివాస్ బెంగుళూర్ నెంబర్ ని ఇచ్చారు. పెద్దపల్లి, ములుగులో జోత్స్న రెడ్డి, శివా రెడ్డి, డబ్బులు పంచుతున్నారు. అక్టోబర్ 15న ట్యాపింగ్ సమాచారం చేరవేశారు. మీడియాలో పనిచేస్తున్న మధుసుదన్ రెడ్డి రేవంత్ కి 3 కోట్లు అరెంజ్ చేశారని తెలిపారు. మరో కీలక వ్యక్తి 80 కోట్లు ఇచ్చేందుకు రెడిగా ఉన్నారని ఫోన్ నెంబర్ తో సహా ఇచ్చేశారు. కొండల్ రెడ్డి కో-ఆర్డినేషన్ చేస్తున్నారని తెలిపారు. బౌరంపేటలో ఉండే మహేందర్ రెడ్డి ట్రాన్స్ పోర్టింగ్ బిజినెస్ లో ఉన్నాడు.  ఎప్పుడు అంటే అప్పుడు లారీలు ఎక్కడికైనా అరెంజ్ చేస్తాడని తెలిపారు. రేవంత్ రెడ్డి వద్ద పని చేసే నగేష్ ని  కూడా ఫాలో కావాలని మెస్సెజ్ లు కొనసాగాయి. అల్లాపాటి విజయ్ కుమార్ ఖమ్మం కి డబ్బులు తీసుకోని వెళ్లుతున్నాడని ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు. అందుకు శ్రీధర్, రాజేందర్, అశోక్ సహాయసహాకారాలు ఉన్నాయని ఫోన్ నెంబర్స్ తో సహా అధికారులకు చేరవేశారు. కర్నాటక నుంచి అంబులెన్స్ లో డబ్బులు వస్తున్నాయని మాట్లాడుకున్నారు. మల్లేష్ కరీంనగర్ కి డబ్బులు సప్లై చేస్తున్నారని తెలుసుకున్నారు. ఒక్క ఛానల్ ఓనరే 100 నెంబర్లు ట్యాపింగ్ చేసి ఎక్కడెక్కడ ఎవ్వరు ఉన్నారో ప్రణీత్ రావుకి తెలియజేశారంటే వీరి ఎంతకు దిగజారారో అర్ధమవుతుంది.

 దొరికింది గోరంతనే, కొండంత సమాచారం సేకరణలో పోలీసులు

 ఇప్పటి వరకు మీడియాలో వచ్చిన అధారాలు కొన్నేనని మరిన్ని సాక్షాదారాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. 100 మంది ఫోన్ నెంబర్స్ తో పాటు చాటింగ్ లిస్టులు భయటకు రానున్నాయి. చేసిన పాపానికి శిక్ష తప్పదని పోలీస్ అధికారులు చెప్పుతున్నారు. డేటా ధ్వంసం చేయడంలో ఎవ్వరెవరి పాత్ర ఉందో దర్యాప్తు చేస్తున్నారు. 



Leave a Comment: