Posted by admin on 2023-01-30 17:31:53 | Last Updated by admin on 2025-07-03 14:36:00
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 990
స్వేచ్చ.. పత్రిక స్వేచ్చ ఒక్కటేనా.. ?
సోషల్ మీడియా.. మీడియా సేమేనా..?
ఆంధ్రజ్యోతి న్యూస్ దా బ్రోకేన్.
యూ తూ.. గళం పై ప్రత్యేక శ్రద్ద.
పబ్లిక్ వాయిస్ పై లేకపాయే..
తెలంగాణలో పప్పులు ఉడకవు.
ఆంధ్రలో వండితే వార్తా..
ప్రజలను మబ్బపెట్టడమే న్యూసీజం.
ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ఎడిటర్
(అచ్చు తప్పులు ఉంటాయి. భాష మారినట్లు.. అచ్చులు మారుతున్నాయి. కోడిగుడ్డు పై ఈకలు పీకకుండా వార్త కంటెంట్ చూడాలని మనవి.)
ప్రజలకు వార్త ఎంటో వడ్డించేది ఏంటో తెలియని పరిస్థితి. అందుకే 90 శాతం సీట్లు గెలిచినా ప్రతినిత్యం మీడియాతో యుద్దం చేయాల్సి వస్తుంది. తమ కులం పార్టీ అధికారంలో ఉంటే చాలు అనుకునే జర్నలిస్టులు కొందరైతే.. తాము నిర్ణయించే వారు ఉండాలని శాసనంలా చెప్పేవారు మరికొందరు. రెండో రకం వారు మారకపోవడం కాక.. అదే పైత్యంని చూపించి.. జనాలకు రుద్దుతున్నారని విమర్శలు ఉన్నాయి. స్వేచ్ఛ పేరుతో పత్రికా స్వేచ్చని వాడుకుంటున్నారు. స్వేచ్ఛలో భాగంగా పత్రిక స్వేచ్చ అని మర్చిపోతున్నారు. అలానే వారు వడ్డించిందే వార్త అని నమ్మిస్తున్నారు. అది అందరికి ప్రమాదామే.. ఇన్నాళ్లు నడిచింది.. నడిపించారు.. ఇకనైనా మారాలని ప్రజలు వేడుకుంటున్నారు. సోషల్ మీడియాకు ప్రధాన మీడియాకు తేడా ఎంటని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు మోస పోయాం. ఇక మీ మీడియా కూడా ఫేక్ వార్తలు వడ్డించే సోషల్ మీడియేనా అని అడ్డుకునే రోజులు వస్తున్నాయి.
యూ గళం .. ఎవరి గళం..
ఆంధ్రజ్యోతి.. ఒక్క పార్టీని నమ్ముకుని నడుస్తున్న పత్రిక. నేరుగా రాజకీయాల్లోకి రాడు. తెర వెనక ఎం చేస్తారో. చంద్రబాబ్ ఇంటర్వ్యూలో దివంగత నేత నందమూరి తారక రామారావు పేరునే పథకాల్లో లేపేయాలని సూచించిన వ్యక్తి. ఆ ఇంటి పేరు వారు రాజకీయాల్లోకి రావాలని అలోచిస్తే.. పాతళలోకంలో పాతిపెట్టాలనే ఆలోచన ఉన్న మేనేజ్ మెంట్.. అలా ఎందుకు తయారు అయ్యాడో ఒక్కసారి గతం చూస్తే అందరికి అర్ధం అవుద్ది. ఇలా రాజకీయాలను పత్రిక స్వేచ్చ పేరుతో గత 35 సంవత్సరాలుగా శాసించేవారు.. కొత్త పలుకులు తొలిపలుకులు అంటూ నీతులు చెప్పుతారు. వారు అనుకున్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని లబ్దిలు పొందారో ఎక్కడ లేదు. నీ స్వలాభం కోసం ఎం పేంపర్లు ఆడావో గుర్తుకు రావు. కాని నీ అనుకునే పార్టీ అధికారం కోసం నీ గళం ఎవరి గళం కావాలి. దానికి ఒక ప్రత్యేక పేజీ.. ప్రత్యేక వెబ్ సైట్ సబ్ టైటిల్. ఇది ఎవరి స్వేచ్ఛ కోసం. ఏ పార్టీ అధికారం స్వేఛ్చ కోసం. దేశంలో మొత్తం జనాభాలో 00.5 అంటే ఎంతో తెలుసునుకుంటా.. అలాంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 5 శాతం మించని మీ అధికారం కోసం ఇలా ఎన్నింటి బ్రేకింగ్ న్యూస్ ని బ్రోకింగ్ లా మారుస్తున్నారో ఆలోచించండి.. జీతాలు ఇస్తే.. దొరికే జర్నలిస్టులు ఉంటారు. కాని నిజాలు ఎంటో తెలిపే జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. అదే ఈ ప్రారంభం. ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ అనేది మీరనుకునే భాష లో కాదు.. భూమి మీద ఉండే ప్రతి హక్కుదారుది.