Srinidhi and Sandhya looting Sahithi Estates in Dubai.

SCAMS Real estate fraud and scams

Posted by admin on 2023-12-16 12:39:26 | Last Updated by admin on 2025-07-03 14:30:44

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 1981


Srinidhi and Sandhya looting Sahithi Estates in Dubai.

  • సాహితీ వేల కోట్ల అక్రమ సంపద ఎక్కడ ?
  • దేశాన్ని విడిచి వెళ్లిన లక్ష్మినారయణ ? తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు చేస్తారా..?   
  • దుబాయిలో  శ్రీనిధి శ్రీహరి తో చెట్టాపట్టాలు.  
  • సెటిల్మెంట్స్ పేరుతో సీఎం, డీజీపీ పేర్లను వాడుతున్న ఓ పేరుపొందిన ఛీటర్ ? 
  • సొంతింటి ఆశ పై నిప్పులు పోసిన క్రిమినల్స్ పై ఇప్పటికైనా చర్యలు ఉండవా..? 
  • 10 నెలలుగా కండిషనల్ బెయిల్లో ఉన్నా ఒక్కసారి సంతకం చేయలేదు. 
  • ఈడీ విచారణకు రావాలని కోర్టులో పిటిషన్ వేసినా రాడు,
  • 50 కేసులు సీసీఎస్ లో నమోదు అయినా పట్టించుకోవడం లేదు.
  • బాధితులకు ఎట్లా న్యాయం జరిగేది ? 
  • మూడు నెలల ముందు మై హోం భూజాలో సెటిల్మెంట్లకు బీజాలు. 
  •  దుబాయికి తరలివెళ్లిన సొత్తు ? కుటుంబాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు. 
  • ఈడీ ఉచ్చుతో అప్పటికే దుబాయిలో శ్రీనిధి శ్రీహరి కుటుంబం. 
  • సిఎం రేవంత్ నిర్ణయం తీసుకోవాలని సాహితీ స్కాం బాధుతుల వేడుకోలు.
  • ఉన్న అస్తులను చక్కపెడుతాను అంటున్న ఆ ఛీటర్ పని పడతారా  ?
  • సాహితీ స్కామర్ బూదాటీ మిస్సింగ్ పై
  • ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ డాట్ కామ్ స్పెషల్ స్టోరీ.  

by 

Devender Reddy 

9848070809.



        సాహితీ 15 వందల కోట్ల అక్రమ సంపద ఎక్కడికి పోయిందో ఇప్పటికి తెలంగాణ పోలీసులు తెల్చలేకపోతున్నారు. 3 వేల మంది సొంతింటి కోసం 30 లక్షల నుంచి 6 కోట్ల వరకు చెల్లించారు. చికిన బొక్కలకు కుక్కలు ఆశపడినట్లు నోట్ల కట్టలకు ఆఫీసర్స్ ఆశ పడి భూమికి టైటిల్ లేకుండానే ఎడాపెడా అనుమతులు ఇచ్చేశారు. రేరా అనుమతులతో బొల్తా కొట్టించారు. తక్కువ ధరకు ఆశ పడి ఇంటికోసం ప్రీ లాంచ్ లో పెట్టుబడి పెట్టారు. గతంలో మార్కెటింగ్ మేనేజర్ పూర్ణచందర్ విషయంలో ఎమ్మెల్సీ కవితకు కోట్లాది రూపాయలు ఇచ్చి సెటిల్మెంట్లు చేసుకున్నారని పోలీసుల విచారణలో తెలింది.  అమీన్ పూర్ , మాధపూర్, కొంపల్లి, కూకట్ పల్లి, ప్రగతి నగర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, లోని ప్రాజెక్ట్స్ లో  1500 కోట్లు కూడగట్టుకోని బిచాణ ఎత్తెశాడు సాహితీ స్కామర్ లక్ష్మినారాయణ. అతని పేరు మీదిగా అలాగే అస్తులు, డెవలఫ్మెంట్ అగ్రిమెంట్స్  ఉండటంతో వాటన్నింటిని తక్కువ ధరకు కొట్టేసేందుకు పక్కగా ఛీటింగ్ ప్లాన్స్ వేస్తున్నారు. అందుకు సిఎం రేవంత్ రెడ్డి , డిజీపీ రవి గుప్తా తనకు క్లోజ్ అంటూ ఓ కన్వన్షన్ ఓనర్  సెటిల్మెంట్స్ కి దిగుతున్నారని తెలుస్తుంది. లీజుకు తీసుకున్న ఛానల్ తో కాంగ్రెస్ నేతలంతా తన గుప్పిట్లో ఉన్నారని చెప్పకోవడంతో దుబాయిలో ఉన్న వారికి సెటిల్మెంట్స్ అప్ డేట్స్ చేస్తున్నారని అరోపణలు ఉన్నాయి.. గతంలో బూదాటీ లక్ష్మినారాయణకు ఈ కన్వెన్షన్ ఓనర్ కి లావాదేవీలు జరిగినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు.  ప్లాట్ ఓనర్స్ ని మేనేజ్ చేస్తాం అంటూ వివాదస్పదంలో ఉన్న ఆస్తులను మరోకరి చేతిలో పెట్టెందుకు భారీ ఎత్తున ప్లాన్స్ వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే జరిగితే  3 వేల మంది జీవితాలు పెనంలోంచి పొయిలో పడ్డట్లే అంటున్నారు సాహితీ బాధితులు.

బెంగళూర్ టూ దుబాయి వయా నేపాల్ ?  

ఎన్నికల సమయంలో పోలీసులు సాహితీ స్కాంని మరిచిపోయారు. బాధితులు ఉద్యమాలు చేసి అలసిపోయారు. ఇదే సరైన సమయం అనుకున్న సాహితీ స్కామర్ బూదాటీ లక్ష్మినారాయణ బెంగళూర్ కు వెళ్లి అక్కడ నుంచి నేపాల్ కు వెళ్లారు. అక్కడ నుంచి దొంగ పాస్ ఫోర్టుతో దుబాయి కి వెళ్లినట్లు అత్యంత సన్నిహితులు చెప్పుకుంటున్నారు. గత ఏడాది డిసెంబర్ 3న అరెస్ట్ అయిన తర్వాత 10 నెలలుగా కండిషనల్ బెయిల్ పై ఉన్న బూదాటీ లక్ష్మినారాయణ ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ లో సంతకం చేయలేదు. ఈడీ విచారణకు రావాలని కోరిన రాలేదు. కోర్టులో పిటిషన్ వేసి నిందుతుడు సహాకరించాలన్నా జాడపత్తా లేకుండా తిరగారు. అధికారుల కళ్లముందే అటు మైహోం బూజాలో , మెయినా బాద్ ఫామ్ హౌజ్ లో అతని చిన్ననాటి స్నేహితుడు గూని బ్రహ్మంతో కలిసి కాకినాడకు తిరుగుతున్నా పట్టించుకోలేదు. అప్పటి ప్రభుత్వ పెద్దలకు నోట్లు కోట్టి కళ్లు మూయించారు. హైకోర్టు అదేశాలతో 50 కేసులను సీసీఎస్ కి బదిలి చేసినా.. ఇప్పటి వరకు ఇంకా విచారణ చేపట్ట లేదు. దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన లక్ష్మినారాయణ కుమారుడు , నింధుతుడు సాత్వీక్ ని ఇమిగ్రెషన్ అధికారులు అరెస్ట్ చేశారు. బెయిల్ పై భయటకు వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ అధికారుల కళ్లు కప్పి దేశం విడిచి వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి చాలా సార్లు ప్రయత్నాలు చేశారు. ఇందుకు ఓ పోలీస్ అధికారి సహాయసహాకారాలు ఉన్నట్లు తెలుస్తుంది. 

సెటిల్మెంట్స్ కి అడ్డగా ఛీటర్ చీధర్ ?

అప్పటికే పలుమార్లు సాహితీ స్కామర్ తో అర్ధిక లావాదేవీలు జరిపిన ఓ కన్వెన్షన్ ఓనర్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో బరి తెగిస్తున్నాడని తెలుస్తుంది. సాహితీ అక్రమ సొత్తు అంతా దుబాయి కి తరలించడంతో పాటు. ఇక్కడ ఉన్న ఆస్థులను ప్లాట్ ఓనర్స్ కళ్లు కప్పి మరికొందరికి అంటకట్టే ప్రయత్నం చేస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందుతుంది. అందుకు డీజీపీ రవిగుప్తా తనకు చాలా క్లోజ్ అంటూ ఎదైనా చేయవచ్చని చెప్పుకోవడంతో ఈ విషయం భయటకు పొక్కింది. సిఎం రేవంత్ రెడ్డి పేరును కూడా పలు మార్లు వాడుతున్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో కూడా కేటీఆర్ పేరును వాడుకుని దందాలు చేయడంతో అప్పుడు కేటీఆర్ చీదురించుకున్నట్లు వినికిడి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, రవి గుప్తా పేరును విరివిడిగా వాడుతుండటంతో పోలీసులు మరింత నిఘా పెంచారు. 


సీఎం రేవంత్ రెడ్డి యే న్యాయం చేయాలి. ?

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మోసగాళ్లను అరికడితేనే ప్రపంచ స్థాయి నగరంగా పేరుగాంచుతుంది. ఇందుకు సాహితీ కేసును పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీఎం చొరవ తీసుకోని బాధితులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుని నింధుతులను వారి వెనక ఉన్న వారిని కఠినంగా శిక్షిస్తే మరోసారి ఇలాంటి ప్రీ లాంచ్ మోసాలు జరగకుండా ఉంటుందని బాధితులు వేడుకుంటున్నారు. 10 రోజుల్లో ప్రభుత్వం స్పందించపోతే.. మళ్లీ ధర్నా చౌక్ లో ఉద్యమాలు చేస్తామని అంటున్నారు.  

శ్రీనిధి శ్రీహరి- సాహితీని, ఫినిక్స్ తో ఎలా ఫిక్స్ చేశారు. కన్వెన్షన్ ఓనర్ తో ఎలా కనెక్షన్ కలుపుతున్నాడు.. చట్టానికి దొరకుండా దుబాయిలో ఎలా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారో అధారాలతో సహా మరో ప్రత్యేక  కథనంలో చూద్దాం. 



Leave a Comment: